చితికి నిప్పంటించేలోపు.. లేచి కూర్చొన్న బామ్మ

by  |
చితికి నిప్పంటించేలోపు.. లేచి కూర్చొన్న బామ్మ
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా దేశంలో విలతాండవం చేస్తోంది. ముసలి, ముతక.. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా కరోనా మహమ్మారి అందర్నీ బలి తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో హాస్పిటల్ లో బెడ్లు దొరక్క. ఆక్సిజన్ సిలిండర్లు లేక ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. అయితే తాజాగా మహారాష్ట్ర ముధాలే.. బారామతి గ్రామంకు చెందిన ఓ 76 ఏళ్ళ బామ్మ కూడా కరోనా బారిన పడింది. చికిత్స నిమిత్తం ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రుల చుట్టూ తిప్పినా బెడ్ లు దొరకని పరిస్థితి.. దీంతో ఆమె కారులోనే స్పృహ తప్పి పడిపోయింది. కుటుంబ సభ్యులు ఎంత లేపినా బామ్మ కదలకపోయేసరికి వారందరూ బామ్మ మృతి చెందిందని భావించి, అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. బంధువులు, స్నేహితులందరికీ కబురు పెట్టారు.

ఇంకొన్ని నిమిషాల్లో తలకొరివి పెట్టనుండగా బామ్మ ఒక్క ఉదుటున లేచి కూర్చొంది. దీంతో అక్కడున్నవారందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అనంతరం ఆమెను ఆసుపత్రిలో చేర్పించి కుటుంబ చికిత్సను అందిస్తున్నారు. నీరసంతో స్పృహ తప్పి పడిపోయిందే కానీ ఆమె గుండె బాగానే కొట్టుకుంటుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బామ్మ గారి స్టోరీ నెట్టింట వైరల్ గా మారింది. ఓ బామ్మ.. నీది గట్టిపిండం.. అని కొందరు కామెంట్ చేస్తుంటే.. చంపేశావ్ పో బామ్మ.. వారందరికీ హర్రర్ సినిమా చూపించావంటూ కామెంట్లు చేస్తున్నారు.

Next Story

Most Viewed