టిప్పర్ చక్రాల కింద నలిగిపోయిన వృద్దురాలు

by  |
టిప్పర్ చక్రాల కింద నలిగిపోయిన వృద్దురాలు
X

దిశ, మల్యాల: జగిత్యాల జిల్లా మల్యాల మండలం దిగువ కొండగట్టు బస్‌ స్టాప్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని తాటిపల్లి గ్రామానికి చెందిన రాజవ్వ అనే వృద్దురాలు (63) టిప్పర్ కిందపడి మరణించింది. బుధవారం కొండాపూర్ గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లి.. కొడుకు బైక్‌పై తిరిగి వస్తుండగా కొండగట్టు స్టేజీ వద్ద వెనక నుండి వచ్చిన టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెనక టైర్ల కింద పడిపోయిన రాజవ్వ కొంతదూరం ఈడ్చుకెళ్లడంతో శరీరం నుజ్జు నుజ్జు అయింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాజవ్వ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed