మిస్టరీగా వృద్ధురాలి మృతి.. అతడే చంపేశాడా?

by  |
Janakamma
X

దిశ, వెబ్‌డెస్క్ : సూర్యాపేట జిల్లాలో విషాధం చోటుచేసుకుంది. కోదాడ మండలం కొమరబండకు చెందిన జానకమ్మ(55) అనే వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రాత్రి వరకు అందరితో మాట్లాడిన జానకమ్మ తెల్లారే సరికి మృతి చెందడం పట్ల గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆమె కుమారుడు జగదీశాచారి నిత్యం మద్యం మత్తులోనే ఉంటూ.. తల్లితో గొడవ పడుతాడని, అతడే తల్లిని గొంతు నులిమి హత్య చేసి ఉండవచ్చని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పోలీసులు సైతం అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.

శనివారం ఉదయాన్నే తన తల్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని కుమారుడు జగదీశాచారి గ్రామస్తులకు తెలిపాడు. ఇంట్లోకి వెళ్లి చూసిన స్థానికులకు జానకమ్మ ఉరి వేసుకున్న ఆనవాళ్లు కనిపించలేని పేర్కొంటున్నారు. ఆమె నేలపై పడుకుని ఉన్నదని చెబుతున్నారు. పైగా తన తల్లి మృతికి గ్రామస్తులే కారణమని ఇంటికి వచ్చిన వారందరిని దూషిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కార్పెంటర్ పని చేసే జగదీశాచారి నిత్యం మద్యం తాగుతూ తన సంపాదన అంతా ఖర్చు చేస్తాడని స్థానికులు తెలిపారు. మద్యం కోసం తల్లికి వచ్చే పింఛన్, ఆమె కూలీ డబ్బులు ఇవ్వాలని గొడవ పడుతాడని పేర్కొంటున్నారు. ఇంట్లో తల్లీ, కొడుకు మాత్రమే ఉంటుండంతో అసలు ఏం జరిగిందో తెలియడం లేదని వివరిస్తున్నారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Next Story

Most Viewed