ప్రాణం తీసిన పది వేలు..!

by  |
ప్రాణం తీసిన పది వేలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో మీ సేవా కేంద్రాల వద్ద వరద బాధితులు బారులు తీరారు. అయితే సర్వర్లు పూర్తిగా పని చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల సర్వర్లు డౌన్ అంటూ ఆఫీస్ తలుపులు మూసివేస్తున్నారు నిర్వాహకులు. కాగా, గోల్కొండ పోలీసు స్టేషన్ పరిధిలో మీ సేవా కేంద్రం వద్ద ఓ వృద్దురాలు మృతి చెందింది. బుధవారం సుమారు మూడు గంటల పాటు క్యూ లైన్ లో నిలబడి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించేలోపు వృద్ధురాలు మరణించింది.

Next Story

Most Viewed