భూమి కోసం ప్రాణం పోయింది

by  |
భూమి కోసం ప్రాణం పోయింది
X

దిశ, మెదక్: ఆస్తుల కోసం ప్రాణాలు పోతున్నాయి.. భూ తగాదాలు కుటుంబాల్లో విషాదాన్ని మిగుల్చుతున్నాయి. ఇటువంటి ఎన్నో సంఘటనలు వెలుగుచూసినప్పటికీ మానవుడి ఆలోచన విధానంలో మార్పు రావడం లేదు. తాజాగా ఆస్తికోసం ఓ వృద్ధుడి ప్రాణం పోయిన ఘటన సిద్దిపేట జిల్లా అక్కడపేట మండలం అంబతండాలో చోటుచేసుకుంది. ఇదే తండాకు నునావత్ సోమ్లా నాయక్‌, అతడి కొడుకు తమకున్న భూమి విషయంలో ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలోనే తండ్రీకొడుకుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే తండ్రిని గట్టిగా కిందకు తోయడంతో కింద పడ్డ నునావత్ సోమ్లా నాయక్ (74) అక్కడికక్కడే మృతి చెందాడు.

Next Story

Most Viewed