- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: ఇప్పటికే కొవిడ్-19తో పోరాటానికి అనేక సంస్థలు, ఎంతోమంది ప్రముఖులు ప్రభుత్వాలకు సాయాన్ని అందించాయి. ఇంకా అదిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలకు సాయంగా అందించడానికి తాజాగా ప్రముఖ క్యాబ్ సర్వీసుల సంస్థ ఓలా గ్రూప్ పీఎం కేర్స్ నిధికి రూ. 5 కోట్లను విరాళంగా ఇస్తున్నట్టు వెల్లడించింది. అలాగే, వివిధ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్లకు కూడా రూ. 3 కోట్లు విరాళం అందిస్తున్నట్టు వెల్లడించింది. ఈ విషయాలను ఓలా గ్రూప్ సీఈవో భవీష్ తెలిపారు. కరోనా మహమ్మారితో ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో భాగంగ, అండగా ఉండేందుకు పీఎం కేర్స్కు రూ. 5 కోట్లు, పలు రాష్ట్రాల ప్రభుత్వాలకు రూ. 3 కోట్లు ఇస్తున్నామని ఆయన వివరించారు.
ఓలా ఇదివరకే తమ సంస్థలో పనిచేస్తున్న క్యాబ్ డ్రైవర్లు, ఆటో వాలాలను ఆదుకునేందుకు నిధుల సేకరణ కోసం ‘డ్రైవ్ ది డ్రైవర్ ఫండ్’ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ వారికోసం తన సంవత్సరం జీతం వదులుకుంటానని ప్రకటించారు.
Tags: Ola, Ola Cabs, Bhavish Aggarwal, Coronavirus, Ola Donates To PM CARES FUND