- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో: పులిచింతల ప్రాజెక్ట్ వద్ద కొట్టుకుపోయిన 16వ నెంబరు క్రస్ట్ గేటు స్థానంలో అధికారులు స్టాప్ లాక్ గేటును అమర్చారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 80మంది సిబ్బంది 20 గంటలపాటు శ్రమించి గేటు ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి 1గంటకు ఫ్లడ్ లైట్ల వెలుతురులో 11 ఎలిమెంట్లను టెక్నికల్ సిబ్బంది అమర్చింది. అనంతరం ఆదివారం ఉదయం స్టాప్ లాక్ గేటును పూర్తిగా అమర్చారు. దీంతో పులిచింతల ప్రాజెక్టు నందు అన్ని గేట్లు మూసి వేసి నీటి నిల్వను ప్రారంభించారు అధికారులు. ఎగువ సాగర్ నుండి వస్తున్న 40వేల క్యూసెక్కుల నీటిని రిజర్వాయర్లో నింపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 6న పులిచింతల ప్రాజెక్టుకు ఉధృతంగా వస్తున్న వరద నీటిని ప్రకాశం బ్యారేజ్కు వదిలేందుకు రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తుతుండగా, ప్రాజెక్ట్ 16వ గేట్ హైడ్రాలిక్ గడ్డర్ తెగిపడడంతో క్రస్ట్గేటుతోపాటు మోటార్ మొత్తం 500 మీటర్ల వరకు వరద నీటిలో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే.