- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ వీడియో కాన్ఫరెన్స్కు అధికారులు హాజరుకాలేదు. శనివారం ఉదయం 10గంటలకు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ.. మధ్యాహ్నం 3గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని చెప్పారు. ఇదేక్రమంలో ఆయన మధ్యాహ్నం 3గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభించినా అధికారులు ఎవరూ అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీ, పంచాయతీరాజ్ అధికారులు, జిల్లాల కలెక్టర్లు కూడా సమావేశంలో పాల్గొనలేదు. సాంకేతిక సమస్యల కారణంగా వీడియో కాన్ఫరెన్స్కు రాలేకపోతున్నామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అయితే వీడియో కాన్ఫరెన్స్కు సంబంధించి సీఎస్ నుంచి కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లపోవడంతోనే అధికారులు సమావేశానికి హాజరుకాలేదని తెలుస్తోంది.
Next Story