కరోనా పాజిటివ్.. అధికారుల అప్రమత్తం

by  |
కరోనా పాజిటివ్.. అధికారుల అప్రమత్తం
X

దిశ, కరీంనగర్: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో పాజిటివ్ కేసు నమోదు కావడంతో.. అధికారులు అప్రమత్తం అయ్యారు. పట్టణంలోని ఆయా ప్రాంతాల ప్రజలు బయటకు రావద్దని మున్సిపల్ కమిషనర్ అయాజ్ కోరారు. కోరుట్లలో ఒకరికి కరోనా వ్యాధి సోకినట్లుగా నిర్ధారణ అయినందున ఈ ప్రాంతాన్ని దిగ్బంధనం చేస్తున్నామని చెప్పారు. ఆ ప్రాంతంలో పూర్తిగా జనసంచారం నిషేదించామన్నారు. అక్కడి ప్రజలు ఎట్టి పరిస్థితులలోను ఇల్లు దాటి బయటకు రాకూడదని కలెక్టర్. బయటకు వచ్చిన వారిని క్వారంటైన్ సెంటర్‌కు తరలిస్తామని స్పష్టం చేశారు. ఆ ప్రాంత ప్రజలు నిత్యావసర సరకుల కోసం ఉదయం 7. నుంచి10 గంటల వరకు టోల్ ఫ్రీ నెం . 1800 425 4346 కు సంప్రదించాలని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.

tag: collector orders, Officials alerted, Corona Positive case, korutla



Next Story

Most Viewed