‘దిశ’ ఎఫెక్ట్.. కోల్డ్ స్టోరేజీ నిర్వాహకులకు అధికారుల వార్నింగ్

by  |
‘దిశ’ ఎఫెక్ట్.. కోల్డ్ స్టోరేజీ నిర్వాహకులకు అధికారుల వార్నింగ్
X

దిశ ఖమ్మం టౌన్ : కొద్ది రోజుల కిందట ‘దిశ’ పత్రికలో కోల్డ్ స్టోరేజ్‌ల్లో ‘కాసుల కక్కుర్తి’ అనే కథనం ప్రచురితం కావడంపై మార్కెటింగ్ అధికారులు స్పందించారు. గురువారం జిల్లా డీఎంవో నాగరాజు ఆధ్వర్యంలో ఉన్నత శ్రేణి సెక్రెటరీ రుద్రాక్షల మల్లేశం, గ్రేడ్-2 సెక్రెటరీ కలసి ఆకస్మిక తనిఖీలు చేశారు.

మార్కెట్‌లో ఏసీ మిర్చికి మంచి గిరాకీ ఉండటంతో రైతులు అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు. దీన్ని అదునుగా చేసుకున్న స్టోరేజ్‌ల నిర్వాహకులు అధిక కిరాయిలు వసూళ్లు చేస్తుండటంతో అధికారులు రిజిస్టర్‌లు తనిఖీలు చేసి యజమాన్యాలను హెచ్చరించారు. మార్కెట్ ధర రూ.192 కన్న ఎక్కువ వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.

Next Story