- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కుకునూరు : పశ్చిమగోదావరి జిల్లా కుకునూరు మండల కేంద్రంలో వలస కూలీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన కొందరు తాపీ వర్కర్లు ఉపాధి నిమిత్తం కుకునూరుకు వలసవచ్చారు. ఈ నేపథ్యంలోనే వీరు మండలంలో పునరావాస నిర్మాణ కాలనీల్లో పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే మధు, శివరాం దాస్ అనే వర్కర్లు నాలుగు రోజుల క్రిందట పని కోసం వెళ్లి ఎంతకీ తిరిగిరాలేదు. వీరి కోసం గాలించిన సదరు కూలీలు ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో మండల కేంద్రంలోని ఓ నూతన భవనం వెనకాలే ఉన్న చెట్ల పొదల్లో శివరాం దాస్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇద్దరూ కలిసి మద్యం సేవించిన తర్వాత గొడవ జరిగుండొచ్చని.. ఈ క్రమంలోనే శివరాం దాస్ను మధు హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
Next Story