క్షుద్రపూజల కలకలం.. రెండు మనిషి బొమ్మలు పెట్టి అలా చేశారు

by  |
క్షుద్రపూజల కలకలం.. రెండు మనిషి బొమ్మలు పెట్టి అలా చేశారు
X

దిశ, వెబ్‌డెస్క్ : టెక్నాలజీ ఎంత పెరిగిన ప్రజలను మూఢనమ్మకాలు మాత్రం అస్సలు వదలడం లేదు. తాజాగా కర్నూలు జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. ఇంత దారుణంగా పూజలు చేస్తారా అన్నట్టు ఉంది అక్కడి పరిస్థితి. జిల్లాలోని పత్తికొండలో మట్టిబొమ్మతో పాటు కోడిగుడ్లు, నిమ్మకాయల పెట్టి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేశారు. అంతే కాకుండా పసుపు, కుంకుమ, రెండు మనిషి బొమ్మలు కూడా ఉండడంతో స్థానికులు ఒక్కసారిగా అవక్కాయ్యారు.. అయితే ఈ క్షుద్రపూజలు చేసిన ప్రదేశం చాలా భయంకరంగా ఉంది. దీంతో దాన్ని చూసిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులు ఫిర్యాదు చేశారు.



Next Story