- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నర్స్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్లితే.. కరోనా విపత్కర సమయంలో గత ఏడాది జిల్లా ప్రధాన ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సులుగా 70 మందిని నియమించారు. అయితే వీరిని నెల రోజుల క్రితం విధుల నుంచి తొలిగించారు. దీంతో వారందరూ వివిధ రూపాలలో నిరసన వ్యక్తం చేస్తున్నా, న్యాయం జరగకపోవడంతో ఆందోళన చెందిన క్రిస్టియన్ పల్లికి చెందిన సుజాత అనే యువతి, నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అది గమనించిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు హుటాహుటిన ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. పెద్ద మొత్తంలో నిద్రమాత్రలు మింగిన సుజాతకు జిల్లా ప్రధాన ఆసుపత్రిలోనే వైద్య సేవలు అందిస్తున్నారు. తమకు న్యాయం జరగకపోవడం వల్లే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సుజాత కొంతమందితో వెల్లడించినట్లు సమాచారం.