ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

by  |
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌‌లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో 40,295మందికి పరీక్షలు నిర్వహించగా 214మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,78,937కు చేరింది. ఇద్దరు చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,078గా ఉంది. ప్రస్తుతం 3,992 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,67,867మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 422మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,13,01,105మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

అనంతపురం జిల్లాలో 17మందికి కరోనా పాజిటివ్‌ నిర్థారణ కాగా చిత్తూరులో 46, తూర్పుగోదావరిలో 18, గుంటూరులో 21, కడపలో 11, కృష్ణా జిల్లాలో 23, కర్నూలులో 8, నెల్లూరులో 9, ప్రకాశంలో 19, శ్రీకాకుళంలో 10, విశాఖపట్నంలో 20, విజయనగరంలో 4, పశ్చిమగోదావరిలో 8 కేసులు వచ్చాయి. కరోనా మహమ్మారి బారిన పడి గుంటూరు, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున చనిపోయినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Next Story

Most Viewed