ఏపీలో కొత్తగా 1,916 కరోనా కేసులు

by  |
ఏపీలో కొత్తగా 1,916 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో 64,581నమూనాలను పరీక్షించగా 1,916 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,27,882కి చేరింది. 13మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 6,719గా ఉంది. ప్రస్తుతం 22,538 యాక్టివ్‌ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 7,98,625మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 3,033మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 81,82,266 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.

కరోనా మహమ్మారి బారిన పడి అనంతపురం జిల్లాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, కృష్ణా జిల్లాలో ముగ్గురు, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, ప్రకాశం, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున చనిపోయారు.

అనంతపురం జిల్లాలో 106 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరులో 121, తూర్పుగోదావరిలో 354, గుంటూరులో 179, కడపలో 141, కృష్ణాలో 68, కర్నూలులో 22, నెల్లూరులో 93, ప్రకాశంలో 178, శ్రీకాకుళంలో 68, విశాఖపట్నంలో 105, విజయనగరంలో 55, పశ్చిమగోదావరి జిల్లాలో 426 కేసులు వచ్చినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Next Story

Most Viewed