ఏపీలో రెండున్నర లక్షలు దాటిన కేసులు

by  |
ఏపీలో రెండున్నర లక్షలు దాటిన కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా వైరస్ విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. రోజుకు వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 9,597 పాజిటివ్‌లు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 2లక్షల 54వేల 146కి చేరింది. ఇవాళ 93మంది చనిపోవడంతో ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 2,296కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 90,425 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 1,61,425 మంది డిశ్చార్జ్ అయ్యారు.

కరోనా వైరస్ మహమ్మారితో ఇవాళ గుంటూరు జిల్లాలో 13 మంది ప్రాణాలు కోల్పోగా ప్రకాశం 11, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 10 చొప్పున మరణాలు సంభవించాయి. శ్రీకాకుళం 9, అనంతపురం, కడపలో ఏడుగురు చొప్పున, విశాఖ 6, తూర్పుగోదావరి 5, విజయనగరం 5, కర్నూలు 4, పశ్చిమగోదావరి జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో ఇద్దరు చనిపోయినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Next Story