ఏపీలో కొత్తగా 2,783 కరోనా కేసులు

by  |
ఏపీలో కొత్తగా 2,783 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో గడిచిన 24గంటల వ్యవధిలో 82,045మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,783 పాజిటివ్‌లు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,23,348కి చేరింది. 14మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 6,690గా ఉంది. ప్రస్తుతం 24,575యాక్టివ్‌ కేసులు ఉండగా, ఇప్పటివరకు చికిత్స తీసుకొని 7,92, 083మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 3,708 మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 80.28లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.

కరోనా మహమ్మారి బారిన పడి చిత్తూరు జిల్లాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా కృష్ణా జిల్లాలో ముగ్గురు, విశాఖలో ఇద్దరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, అనంతపురంలో ఒకరు, తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు చనిపోయారు.

పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 469 పాజిటివ్ కేసులు నమోదు కాగా కృష్ణాలో 425, తూర్పుగోదావరి జిల్లాలో 371, చిత్తూరులో 351, అనంతపురంలో 170, కడపలో 169, ప్రకాశం జిల్లాలో 134, విశాఖలో 113, నెల్లూరులో 86, విజయనగరంలో 70, కర్నూలులో 34కేసులు వచ్చినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.



Next Story

Most Viewed