ఏపీలో కొత్తగా 2,949 కరోనా కేసులు

by  |
ఏపీలో కొత్తగా 2,949 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24గంటల వ్యవధిలో 77,028మందికి పరీక్షలు నిర్వహించగా 2,949 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,14,774కు చేరింది. 18మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 6,643గా ఉంది. ప్రస్తుతం 26,622 యాక్టివ్ కేసులు ఉండగా, ఇఫ్పటివరకు చికిత్స తీసుకొని 7,81,509మంది బాధితులు డిశ్చార్జ్‌ అయ్యారు. తాజాగా 3,609 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 77,73,681 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.

కరోనా మహమ్మారి బారిన పడి అనంతపురం జిల్లాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా గుంటూరు జిల్లాలో ముగ్గురు, పశ్చిమగోదావరి జిల్లాలో ముగ్గురు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, చిత్తూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, విశాఖలో ఇద్దరు చనిపోయారు.

అనంతపురం జిల్లాలో 192 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరులో 315, తూర్పుగోదావరిలో 417, గుంటూరులో 421, కడపలో 193, కృష్ణాలో 457, కర్నూలులో 32, నెల్లూరులో 76, ప్రకాశంలో 99, శ్రీకాకుళంలో 74, విశాఖపట్నంలో 114, విజయనగరంలో 67, పశ్చిమగోదావరి జిల్లాలో 492 కేసులు వచ్చినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.


Next Story

Most Viewed