ఏపీలో కొత్తగా 4,038 కరోనా కేసులు

by  |
ఏపీలో కొత్తగా 4,038 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో 73,767మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4,038మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7లక్షల 71వేల 503కు చేరింది. 38మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 6,357గా ఉంది. ప్రస్తుతం 40,047 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 7లక్షల 25వేల 99మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 5,622 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 68,46,040 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

కరోనా మహమ్మారి బారిన పడి చిత్తూరు జిల్లాలో 9మంది ప్రాణాలు కోల్పోగా ప్రకాశం జిల్లాలో ఏడుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, కడప జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, కర్నూలు, అనంతపురం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు.

అనంతపురం జిల్లాలో 232మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా చిత్తూరులో 489, తూర్పుగోదావరి జిల్లాలో 548, గుంటూరులో 390, కడపలో 281, కృష్ణా జిల్లాలో 421, కర్నూలులో 103, నెల్లూరులో 178, ప్రకాశం జిల్లాలో 299, శ్రీకాకుళం జిల్లాలో 119, విశాఖపట్నంలో 196, విజయనగరంలో 96, పశ్చిమగోదావరి జిల్లాలో 686 కేసులు వచ్చినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.


Next Story