ఏపీలో కొత్తగా 5,210 కరోనా కేసులు

by  |
ఏపీలో కొత్తగా 5,210 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి తగ్గడం లేదు. గత కొద్దిరోజులుగా 5వేలకు ఏమాత్రం తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 75,517మందికి పరీక్షలు నిర్వహించగా 5,210మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7లక్షల 55వేల 727కు చేరింది. 30మంది చనిపోవడంతో కరోనాతో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 6,224కు చేరింది. ప్రస్తుతం 46,295 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 7లక్షల 3వేల 208 మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా 5,509మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 65లక్షల 69వేల 616 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.

కరోనా మహమ్మారి బారిన పడి ప్రకాశం జిల్లాలో 8 మంది ప్రాణాలు కోల్పోగా చిత్తూరు జిల్లాలో నలుగురు, విశాఖపట్నంలో ముగ్గురు, కడపలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, అనంతపురం జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు చొప్పున చనిపోయారు.

అనంతపురం జిల్లాలో 311 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరులో 713, తూర్పుగోదావరిలో 701, గుంటూరులో 431, కడపలో 418, కృష్ణా జిల్లాలో 462, కర్నూలులో 715, నెల్లూరులో 288, ప్రకాశంలో 362, శ్రీకాకుళంలో 212, విశాఖపట్నంలో 190, విజయనగరంలో 161, పశ్చిమగోదావరిలో 786 కేసులు వచ్చినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.



Next Story