పొలిటికల్ ఎంట్రీపై తారక్ రియాక్షన్ ఇదే…

by  |
ntr political entry
X

దిశ, సినిమా : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ద్వారా బుల్లితెరపై మరో కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్నారు. జెమినీ టీవీలో ఆదివారం నుంచి ఈ కార్యక్రమం ప్రసారం కాబోతుండగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు తారక్. బిగ్ బాస్ తర్వాత ప్రజలతో మమేకమయ్యేందుకు ఈ షో ఉపయోగపడుతుందన్న జూనియర్.. కంటెస్టెంట్‌ల లైఫ్ జర్నీ గురించి తెలుసుకునేందుకు ఎగ్జైటింగ్‌గా ఉన్నానని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ హోస్ట్‌గా తమదైన మార్క్ చూపించారని.. వారి నుంచి ఈ చాలెంజ్ స్వీకరిస్తూ తన మార్క్‌ను చూపేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.

ఈ షో తనకు ఒక లెర్నింగ్ అవుతుందని, ఎంతో కొంత నేర్చుకోగలనని నమ్ముతున్నానని తెలిపారు. ‘మనిషి అనే వాడు అసమానుడు.. షోకి వచ్చిన ప్రతీ కంటెస్టెంట్ గెలవాలనే కోరుకుంటున్నా’ అని అన్నారు. బిగ్ బాస్ కన్నా ఎక్కువ ఎమోషన్స్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో ఉంటాయన్నారు తారక్. ఇక పొలిటికల్ ఎంట్రీపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ… రాజకీయాల గురించి మాట్లాడేందుకు ఇది సందర్భం కాదని తెలిపారు. కాగా, ఎన్టీఆర్ అండ్ జెమినీ టీమ్.. ఐటీసీ కోహినూర్‌లో మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు.


Next Story

Most Viewed