- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీఎంసీ పార్టీ, గుర్తు దుర్వినియోగమవుతోంది.. రెబల్స్ పై మమత వర్గం ఫిర్యాదు
టీఎంసీ పార్టీ, గుర్తును దుర్వినియోగం చేస్తున్నారని తిరుగుబాటు వర్గంపై మమతా బెనర్జీ వర్గం ఫిర్యాదు చేసింది

దిశ, నేషనల్ బ్యూరో : పశ్చిమ బెంగాల్ను 15 ఏళ్ల పాటు ఏకచక్రాధిపత్యంగా పాలించిన టీఎంసీలో ఆధిపత్యం కోసం రెండు వర్గాల మధ్య సాగుతున్న అంతర్గత పోరు మరింత ముదిరింది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మద్దతుదారులు.. తిరుగుబాటు నేత, ప్రత్యర్థి వర్గానికి నాయకత్వం వహిస్తున్న రితబ్రత బెనర్జీ, అతని అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ పేరు, గుర్తును దుర్వినియోగం చేస్తూ వారు కార్యకర్తలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాళీఘాట్, న్యూ టౌన్ పోలీస్ స్టేషన్లలో టీఎంసీ నేషనల్ జాయింట్ జనరల్ సెక్రటరీ డోలా సేన్ ఈ ఫిర్యాదులను దాఖలు చేశారు. ఇందులో రితబ్రత బెనర్జీ, అరూప్ రాయ్, జావేద్ ఖాన్, సందీపన్ సాహా, బిప్లబ్ మిత్రల పేర్లను చేర్చారు. ఈ బృందం చట్టవిరుద్ధంగా ఒక సమాంతర సంస్థను నడుపుతోందని, తామే అధికారిక టీఎంసీ అని అబద్ధపు ప్రచారం చేస్తోందని పార్టీ ఆరోపించింది. కాగా.. దీనిపై రితబ్రత బెనర్జీ స్పందిస్తూ.. ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చని, దేశంలో చట్టం, ఎలక్షన్ కమిషన్ ఉన్నాయని తెలిపారు. అందరికీ వాటిపై నమ్మకం ఉండాలని తెలిపారు.






