వీడిన NRI డాక్టర్ మిస్సింగ్ మిస్టరీ.. వ్యవసాయ బావిలో శవంగా..

by  |
NRI Doctor Missing
X

దిశ, వెబ్‌డెస్క్: ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సుధీర్ రెడ్డి బాబాయ్ కొడుకు, NRI డాక్టర్ జయశీల్ రెడ్డి మిస్సింగ్ నల్లగొండ జిల్లాలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా మేళ్లదుప్పలపల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి సుశీల్ రెడ్డి వచ్చి, డ్రైవర్‌ను గెస్ట్‌హౌస్‌లో ఉండమని చెప్పి క్షేత్రం లోపలికి వెళ్లారు. వ్యవసాయ క్షేత్రంలోని ఉన్న కుంట అలుగు పోస్తున్న ఫొటోలను మేనమామ వినోద్‌రెడ్డికి ఉదయం 7.30కి వాట్సాప్‌లో పంపి, 8.11 గంటలకు తల్లి సునందతో ఫోన్‌లో మాట్లాడారు. 9 గంటలకు ఫోన్‌ స్విచ్ఛాఫ్ కుటుంబసభ్యులు హుటాహుటిన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు.

ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన చెంది పోలీసులకు సమాచారం అందించారు. డాగ్‌స్క్వాడ్‌తో పరిశీలించగా శునకం గ్రామం మొత్తం తిరిగి మళ్లీ వ్యవసాయ క్షేత్రంలోని బావి వద్ద ఆగింది. దీంతో వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు జారిపడి ఉంటారా అన్న అనుమానంతో బావిలో ఉన్న నీటిని మోటార్ల ద్వారా తోడిస్తున్నారు. కాగా, జమైకాలో వైద్య విద్యను పూర్తి చేసిన జయశీల్ రెడ్డి, ఇటీవలే ఇండియాకు వచ్చినట్లు సమాచారం. అంతేగాకుండా.. రేపు(బుధవారం) జయశీల్ రెడ్డి అమెరికా వెళ్లాల్సి ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, ఎట్టకేలకు NRI డాక్టర్ మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. అమెరికా వెళ్లాల్సిన వాడు, వ్యవసాయ క్షేత్రంలోని బావిలో శవంలా మారాడు. డెడ్ బాడీని బయటకు తీసిన పోలీసులు, హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.



Next Story