సింగరేణి అధికారులకు నోటీసులు…

by  |
సింగరేణి అధికారులకు నోటీసులు…
X

దిశ ,బెల్లంపల్లి : సింగరేణి సంస్థలోని కార్పొరేట్ విభాగంలో గల ఉన్నతాధికారులకు రాష్ట్ర సమాచార హక్కుచట్టం నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థగా పేరొందిన సింగరేణి సంస్థలో సమాచార హక్కు చట్టం ద్వారా అడిగినా… వివరాలను 30 రోజులలోగా సమాచారం కోరిన వ్యక్తులకు అందజేయకపోవడంతో సదరు అధికారులకు నోటీసులు జారీ చేసి, ఈనెల 19న హైదరాబాద్ లోని సమాచార హక్కు చట్టం కార్యాలయం హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొనడం జరిగింది.

నోటీసులు అందుకున్న వారిలో కార్పొరేట్ లోని జనరల్ మేనేజర్ (పర్సనల్ ), జనరల్ మేనేజర్ (హెచ్ ఆర్ డి) విభాగాల ఉన్నతాధికారులు ఉన్నారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కార్యదర్శి మేరుగు రాజయ్య రెండు సార్లు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నా..అతనికి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో అధికారులకు నోటీసులు జారీ అయ్యాయి.


Next Story

Most Viewed