పవన్ కళ్యాణ్‌కు నోటీసులు ఇవ్వలేదు

by  |
Pawan Kalyan
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీంతో పవన్‌కు ఈసీ నోటీసులు జారీ చేసిందని వార్తలు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే దీనిపై తాజాగా.. ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌కు తాము ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అంతేగాకుండా పవన్ కళ్యాణ్‌పై తమకు ఎవరూ ఫిర్యాదు కూడా చేయలేదని అన్నారు.


Next Story

Most Viewed