ఎవరెస్ట్‌ను తాకిన కరోనా.. పర్వతారోహకుడికి పాజిటివ్

by  |
ఎవరెస్ట్‌ను తాకిన కరోనా.. పర్వతారోహకుడికి పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తోంది. ఎవరిని, ఏ చోటుని వదలడం లేదు. తాజాగా ఎవరెస్టు పర్వతంపై మొదటిసారి ఓ కరోనా కేసు వెలుగు చూసింది. నార్వేకు చెందిన ఎర్లెండ్​నెస్​అనే పర్వతారోహకుడికి ఎవరెస్ట్ బేస్​క్యాంపులో కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. పాజిటివ్‌గా తేలిని వెంటనే అతడిని హెలికాప్టర్ ద్వారా ఖాట్మాండ్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఎవరెస్టు పర్వతంపై కరోనా పాజిటివ్ కేసు వెలుగు చూడటం ఇదే తొలిసారి. ఎర్లెండ్​నెస్‌కు కరోనా సోకిన నేపథ్యంలో.. తక్షణమే బేస్​ క్యాంపులోని మిగతా వారికి పరీక్షలు చేయనున్నట్టు సమాచారం.

Next Story

Most Viewed