‘ బీజేపీకి ఓట్లు వేయనియ్యం’

by  |
‘ బీజేపీకి ఓట్లు వేయనియ్యం’
X

దిశ,వెబ్ డెస్క్: రైతునేత బల్బీర్ సింగ్ రజేవాల్ కోల్ కత్తాకు వెళ్లనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో తిరిగి బీజేపీకి ఒక్క ఓటు కూడా పడకుండా చూస్తాం అని చెప్పారు. అయితే పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. గత ఎన్నికల్లో 42 గాను 19 సీట్లు సాధించింది. ఈ సారీ ఎలా అయినా అక్కడ అధికారం దక్కించుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ , అమిత్ షా యూపీ సీఎం ఆదిత్యనాథ్ ప్రచారం చేశారు. అయెతే మేము ముందుగా పశ్చమ బెంగాళ్ కి వెళ్లి అక్కడ భారతీయ జనతా పార్టీకి ఓట్లు పడకుండా చేస్తాం అన్నారు. కోల్ కత్తా , చండీ ఘడ్ లో మాట్లడుతామన్నారు. కేంద్ర తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా వేలాది మంది రైతులు 100 రోజులకు పైగానే ఆందోళన చేస్తున్నారు. కనీస మద్దతు ధర కూడా కోల్పోయేలా ఆ చట్టాలు ఉన్నాయని నిరసనలు చేపడుతున్నారు. అయినా ప్రైవేటు అధిపత్యమే చెల్లుబాటు అవుతుందన్నారు.

Next Story

Most Viewed