యురేనియం తవ్వకాలు జరగడం లేదు

by  |

దిశ, మహబూబ్‌నగర్: నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరుగుతాయన్న ప్రచారానికి నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెరదించారు. రెండు రోజుల క్రితం ఓ ప్రైవేట్ సంస్థ యురేనియం కోసం తవ్వకాలకు శ్రీకారం చుడుతుందనే వద్దంతులు జిల్లా వ్యాప్తంగా వ్యాపించాయి. ఈ విషయంపై నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీధర్ వివరణ ఇచ్చారు. నల్లమల అమ్రాబాద్ రిజర్వు ఫారెస్ట్ ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణ చర్యలే తప్ప, ఏ విధమైన యురేనియం పనులు జరగడం లేదని స్పష్టం చేశారు. వన్యప్రాణులకు త్రాగు నీటిని ట్యాంకర్ల ద్వారా అందజేసేందుకు రోడ్డు మరమ్మత్తులు మాత్రమే జరుగుతున్నాయని కలెక్టర్ వెల్లడించారు.

Tags: Collector Sridhar, No uranium mining, Nallamala Forest, Nagarkurnool


Next Story

Most Viewed