దిశ చట్టంపై ఏపీ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు : కేంద్రం

by  |
Disha-act
X

దిశ, ఏపీ బ్యూరో : దిశ బిల్లుపై ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రం పంపిన బిల్లుపై తమ అభ్యంతరాలను, మంత్రిత్వశాఖ లేవనెత్తిన పలు అంశాలపై వివరణ కోరినట్లు హోంశాఖ పేర్కొంది. తాము లేవనెత్తిన అభ్యంతరాలకు, వివరణలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్ మిశ్రా తెలిపారు.

దిశ చట్టం గురించి లోక్‌సభలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన సమాధానంతో ఎంపీ గోరంట్ల మాధవ్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.


Next Story