విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ జరగదు !

by  |
విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ జరగదు !
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ జరగదని మంత్రి బాలినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్ మీటర్లతో రైతులపై ఎలాంటి భారం పడదని, కావాలనే టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం తెచ్చిన విద్యుత్ బిల్లులను వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. మా వ్యతిరేకతను తెలియజేస్తూ కేంద్రానికి కూడా లేఖ రాశామని తెలిపారు. విద్యుత్ మీటర్లను రైతులకు ఉచితంగానే బిగిస్తామని వెల్లడించారు.



Next Story