బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీర్స్ డే వేడుకలపై అలసత్వం..

by  |
బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీర్స్ డే వేడుకలపై అలసత్వం..
X

దిశ, బాసర : రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వ విద్యాలయం బాసర ట్రిపుల్ ఐటీలో అధికారులు అలసత్వం వహించారు. సెప్టెంబర్ 15 న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని ఇంజినీర్స్ డే గా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ప్రతీ సంవత్సరం ఇంజినీర్స్ డే రోజు ట్రిపుల్ ఐటీలో విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా వేడుకలు జరిపేవారు.

కానీ, ఈ సంవత్సరం అధికారులు అలసత్వం వహించి.. ఇంజినీర్స్ డే అన్న సంగతి కూడా మరచిపోయారు. ఇంజినీర్స్ డే వేడుకను కాలేజీలో జరుపలేదు. దేశానికి ఆయన చేసిన సేవలను భావితరాలకు ఎవరు గుర్తు చేయాలని బాసర మండల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. ట్రిపుల్ ఐటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులో విద్యార్థులు ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తారు.

Next Story

Most Viewed