అలర్ట్.. నిజాంసాగర్ ఏడో గేట్ ఎత్తివేత

by  |
అలర్ట్.. నిజాంసాగర్ ఏడో గేట్ ఎత్తివేత
X

దిశ, పిట్లం: జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. మంగళవారం ఒక గేట్‌ను ఎత్తి మంజీరా నదిలోకి నీటిని వదిలారు. ఎగువన ఉన్న సింగూర్ ప్రాజెక్ట్ నుంచి 23 వేల 900 ఇన్‌ఫ్లో రావడంతో.. 5,300 టీఎంసీల నీటిని మంజీరా నదిలోకి జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే, స్థానిక ఎంపీపీ, జడ్పీటీసీలు.. ఏడో నెంబర్ గేట్ ఎత్తి నీటిని వదిలారు. నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకోవడంతో నీటిని దిగువకు వదిలినట్టు అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే మంజీరా నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Next Story

Most Viewed