ఉపాధిలో ఆ ఉపాయం మరవొద్దు

by  |
ఉపాధిలో ఆ ఉపాయం మరవొద్దు
X

దిశ, నిజామాబాద్: ఉపాధి పనుల్లో కూలీలు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ విఠల్‌రావు సూచించారు. నందిపేట్ మండలంలోని బజార్ కొత్తూరు, ఉమ్మెడ, సీహెచ్ కొండూరు గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సోమవారం జెడ్పీ చైర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలకు మాస్కులు పంపిణీ చేశారు. విధిగా ప్రతి ఉపాధి కూలీ మాస్క్ తప్పనిసరిగా ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ యమున, సర్పంచ్ పోసాని, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story