- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరానికి చెందిన యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అమెరికాలో గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం సాయంత్రం ఆలస్యంగా వెలుగుచూసింది. నగరంలోని మారుతీ నగర్కు చెందిన సుధాకర్ నాయక్ విశ్రాంత బీసీ వెల్పేర్ ఆఫీసర్. ఆయనకు సాయి సుశాంత్ (30) అనే కొడుకు ఉన్నాడు. నిజామాబాద్లో బీటెక్ చదివాడు. ఆ తర్వాత అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి, అక్కడే మిచిగాన్ రాష్ట్రంలో పవర్ ఇండస్ట్రీస్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా స్థిరపడ్డాడు.
ఈనెల 12న తాను నివాసముంటున్న ఇంట్లోనే అనుకోకుండా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో అక్కడిక్కడే మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ మేరకు మృతుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు అమెరికా అధికారులు. సుధాకర్ నాయక్ ఏకైక సంతానం కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మంగళవారం సాయి సుశాంత్ మృతదేహం నిజామాబాద్కు రానున్నట్టు తెలుస్తోంది.