పోరాటం ఆగదంటున్న నివిన్ పౌలీ..

by  |
పోరాటం ఆగదంటున్న నివిన్ పౌలీ..
X

‘బెంగళూరు డేస్, ప్రేమమ్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచమమున్న మలయాళ నటుడు నివిన్ పౌలీ. 2019లో వచ్చిన ‘కాయమ్‌కులమ్ కొచ్చున్ని’ సినిమాలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బెస్ట్ యాక్డర్‌గానూ అవార్డు తీసుకున్నాడు. బీటెక్ చదివిన ఈ నటుడు.. కొన్నేండ్లు ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేశాడు. తండ్రి మరణం తర్వాత సినిమాల వైపు వచ్చిన నివిన్.. ప్రతి సినిమాకు తన బెస్ట్ ఔట్‌పుట్ ఇస్తుంటాడు. అందుకే ఆయన చేసిన సినిమాలకు అవార్డులు క్యూ కడుతుంటాయి. ఈ టాలెంటెడ్ యాక్టర్.. ప్రస్తుతం ‘పడవెట్టు’ అనే సినిమాలో నటిస్తుండగా.. ఈ చిత్ర ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. ఆ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంటూ ‘సంఘర్షణ.. పోరాటం.. మనుగడ.. మనుషులు ఎప్పటి వరకు జీవించి ఉంటారో.. అప్పటివరకు పోరాటం జరుగుతూనే ఉంటుంది’ అని రాసుకొచ్చాడు.

ఈ చిత్రానికి లిజు కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. సన్నీవేయన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. నివిన్‌కు జోడీగా మంజు వారియర్ నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి 96 ఫేమ్ గోవింద వసంత సంగీతం అందిస్తున్నారు. తెలుగులో శర్వానంద్, త్రిష జంటగా నటించిన ‘జాను’ చిత్రానికి కూడా ఈయనే స్వరాలు సమకూర్చారు.

Next Story

Most Viewed