రోడ్డుపై ‘రయ్‌’మంటూ దూసుకెళ్లిన మంత్రి.. నెటిజన్ల కామెంట్స్.. వీడియో వైరల్

by Vadlamudi Anukaran |   (  Updated:2021-09-19 23:44:39  IST  )

<p>దిశ, డైనమిక్ బ్యూరో : దేశంలోని రోడ్లపై 100 స్పీడ్ దాటగానే ఓవర్ స్పీడ్ కారణంగా జరిమానా అంటూ మొబైల్‌కి మెసేజ్ వచ్చేస్తుంది. మరి.. అదే ఓ కేంద్ర మంత్రి ఏకంగా 170 కిలోమీటర్ల వేగంతో రోడ్డుపై దూసుకెళ్లారు. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకెళితే.. ఢిల్లీ నుంచి ముంబైకి కేవలం12 గంటల్లో చేరుకునేందుకు కేంద్రం ఎక్స్‌ప్రెస్ హైవేని నిర్మిస్తోంది. ఈ నిర్మాణ పనులను పరిశీలించడానికి వచ్చిన కేంద్ర [&hellip;]</p>

రోడ్డుపై ‘రయ్‌’మంటూ దూసుకెళ్లిన మంత్రి.. నెటిజన్ల కామెంట్స్.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో : దేశంలోని రోడ్లపై 100 స్పీడ్ దాటగానే ఓవర్ స్పీడ్ కారణంగా జరిమానా అంటూ మొబైల్‌కి మెసేజ్ వచ్చేస్తుంది. మరి.. అదే ఓ కేంద్ర మంత్రి ఏకంగా 170 కిలోమీటర్ల వేగంతో రోడ్డుపై దూసుకెళ్లారు. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకెళితే.. ఢిల్లీ నుంచి ముంబైకి కేవలం12 గంటల్లో చేరుకునేందుకు కేంద్రం ఎక్స్‌ప్రెస్ హైవేని నిర్మిస్తోంది.

ఈ నిర్మాణ పనులను పరిశీలించడానికి వచ్చిన కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, స్వయంగా స్పీడ్ టెస్టు కూడా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన నిర్మాణ దశలో ఉన్న ఆ రహదారిపై 170 కిలోమీటర్ల వేగంతో కారులో దూసుకుపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. రూ.98 వేల కోట్లతో ఈ హైవేను నిర్మిస్తున్నారు. 2023 మార్చి వరకూ హైవే అందుబాటులోకి రానుంది.

Next Story