పవర్ స్టార్‌తో నితిన్ స్క్రీన్ షేర్?

by  |
పవర్ స్టార్‌తో నితిన్ స్క్రీన్ షేర్?
X

దిశ, వెబ్‌డెస్క్: సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ దసరా సందర్భంగా కొత్త సినిమా ప్రకటించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నట్లు వెల్లడించడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. అయితే ఈ సినిమాలో మరో హీరోకు కూడా అధిక ప్రాధాన్యత ఉండగా.. ఆ కథానాయకుడు ఎవరు? అనే విషయంలో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది.

ముందుగా ఈ పాత్ర రానా చేస్తాడని వార్తలు వచ్చినా, తాజాగా మరో హీరో పేరు తెరమీదకొచ్చింది. పవర్ స్టార్ డైహార్డ్ ఫ్యాన్ నితిన్ ఈ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే సినిమా రికార్డులు కొల్లగొట్టడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. హీరో, ఫ్యాన్ కలిసి సరికొత్త కాంబినేషన్‌తో వస్తున్న ఈ చిత్రం తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ వైఫ్‌గా ఫిదా బ్యూటీ సాయిపల్లవి నటించనుందనే న్యూస్ కూడా ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది.

ఒక పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మధ్య ఈగో క్లాష్ నేపథ్యమే ఈ సినిమా కథ కాగా.. మాలీవుడ్‌లో పృథ్వి రాజ్ సుకుమారన్, బిజూ మీనన్ ఈ పాత్రల్లో నటించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కాగా ఈ సినిమా దర్శకుడు సాచి లాక్‌డౌన్‌లో మరణించారు.


Next Story

Most Viewed