నీతా అంబానీ లెక్చరర్‌గా వెళ్లడం లేదట

by  |
నీతా అంబానీ లెక్చరర్‌గా వెళ్లడం లేదట
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోనే అత్యంత ధనవంతుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. వ్యాపార కార్యకలాపాలతో పాటు సేవా కార్యక్రమాలతో ఆమె ఎప్పుడూ వార్తల్లో ఉంటూ ఉంటారు. రిలయన్స్ ఫాండేషన్ ద్వారా నీతా అంబానీ అనేక సేవా కార్యక్రమాలున నిర్వహిస్తున్నారు. సేవా కార్యక్రమాలకు గాను ఆమెకు అనేక అవార్డులు కూడా లభించాయి.

అయితే నీతా అంబానీ బెనారస్ హిందూ యూనివర్సిటీకి లెక్చరర్‌గా వెళ్లనున్నారనే వార్తలు మీడియాలో ఉదయం నుంచి జోరుగా వినిపిస్తున్నాయి. ఆమె సోషల్ సైన్సెస్ బోధించనున్నారని ఊహాగానాలు వచ్చాయి. దీంతో ఇది నిజమేనని అందరూ అనుకున్నారు. కానీ చివరికి ఇది ఫేక్ అని తేలింది. నీతా అంబానీకి యూనివర్సిటీ నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదని, మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక ప్రకటన విడుదల చేసింది.


Next Story

Most Viewed