- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నిశ్శబ్దం.. సైలెంట్గా వస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద వయలెన్స్ క్రియేట్ చేయడానికి సిద్ధం అవుతోంది. లాక్డౌన్ తర్వాత సెన్సార్ సర్టిఫికెట్ అందుకున్న తొలి చిత్రంగా హిస్టరీ క్రియేట్ చేసిన ఈ సినిమా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మరిన్ని రికార్డులు సృష్టించేందుకు సిద్ధంగా ఉందని ధీమా వ్యక్తం చేస్తోంది మూవీ యూనిట్. కాగా అరుంధతి, భాగమతి లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాల తర్వాత లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. సినిమాలో మూగ అమ్మాయిగా కనిపించబోతున్న స్వీటీ.. తన మౌనంతోనే సెన్సేషన్ క్రియేట్ చేయబోతోందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా U/A సర్టిఫికెట్ పొందగా.. కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. సినిమా గురించి సెన్సార్ బోర్డు సభ్యులు ఇచ్చిన కాంప్లిమెంట్స్తో ఆనందంగా ఉందన్న హేమంత్.. థియేటర్లోనే సినిమా రిలీజ్ చేయాలన్న వారి సలహాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Both our films #nishabdham Telugu and #silence given U/A censor certificate and I am overwhelmed by the response of the #cencorboard panel members and my sincere thanks to them for there advice to release the film first in theatre 🙏 pic.twitter.com/bIZTOvjY7q
— Hemantmadhukar (@hemantmadhukar) May 26, 2020
తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క సరసన ఎవర్ గ్రీన్ హీరో మాధవన్ నటిస్తుండగా.. అంజలి, షాలిని పాండే ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మించాయి. గోపి సుందర్ మ్యూజిక్ అందించగా.. శానియల్ డియో సినిమాటోగ్రాఫర్గా పని చేశారు.