‘కొడాలి’పై నిమ్మగడ్డ సీరియస్.. క్రిమినల్ కేసుకు ఆదేశం

by  |
‘కొడాలి’పై నిమ్మగడ్డ సీరియస్.. క్రిమినల్ కేసుకు ఆదేశం
X

దిశ,వెబ్‌డెస్క్: మంత్రి కొడాలి నానిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ సీరియస్ అయ్యారు. కొడాలి నానిపై కేసులు నమోదు చేయాలని అధికారులను నిమ్మగడ్డ ఆదేశించారు. ఎస్ఈసీని బెదిరించారనే అంశంపై మంత్రి కొడాలి నానిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కృష్ణా ఎస్పీకి ఆదేశాలు ఆయన జారీ చేశారు. మంత్రిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేయాలని తెలిపింది. ఎస్ఈసీపై తీవ్ర విమర్శలు చేయడంతో మంత్రికి ఎస్ఈసీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం..ఆ తర్వాత దానికి మంత్రి సమాధానంపై సంతృప్తి చెందక మంత్రి పై ఎస్ఈసీ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed