అన్ని పార్టీలతో SEC నిమ్మగడ్డ మీట్..

by  |
nimmagadda ramesh kumar
X

దిశ, వెబ్‌డెస్క్ : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ అన్ని పార్టీలతో సమావేశం కానున్నారు. ఈ నెల 28న పార్టీ సమావేశం జరగనుండగా, అన్ని పార్టీల నాయకులతో చర్చించి స్థానిక ఎన్నికలపై వారి అభిప్రాయం తీసుకోనున్నారు.

ఇదిలాఉండగా, ఇప్పట్లో స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పష్టంచేశారు. దసరా పండుగ తర్వాత కరోనా సెకండ్ వేవ్ ఉంటుందని నిపుణులు హెచ్చరించడమే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు.



Next Story