ఆ రాష్ట్రాల్లో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ

by  |
ఆ రాష్ట్రాల్లో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ
X

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని తొమ్మిది పట్టణాల్లో శనివారం నుంచి నైట్ కర్ఫ్యూ అమలులోకి రానుంది. రాష్ట్రంలో కరోనా ఉధృతి నేపథ్యంలో ఈ నెల 30వరకు నైట్ కర్ఫ్యూను కొనసాగించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అజ్మీర్, అల్వార్, బిల్వారా, చిత్తోర్‌ఘర్, దుంగార్పూర్, జైపూర్, జోధ్‌పూర్, కోట, అబు రోడ్డులలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్టు పేర్కొంది. కాగా ఉదయ్‌పూర్‌లో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉంటుందని వెల్లడించింది.

Next Story

Most Viewed