9మంది ఉగ్రవాదులను దోషులుగా తేల్చిన కోర్టు

by  |
9మంది ఉగ్రవాదులను దోషులుగా తేల్చిన కోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో పేలుళ్లకు భారీ స్కెచ్ గీసిన 9మంది ఐసిస్ ఉగ్రవాదులను ఎన్ఐఏ స్పెషల్ కోర్టు దోషులుగా తేల్చింది. ముస్లిం యువకులను ఉగ్రవాదం వైపు ఆకర్షించి ఐసిస్‌లో చేరేలా ప్రేరేపించిన 19మందిని 2015లో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. సోషల్ మీడియా వేదికగా ఐసిస్‌కు యువకులను రిక్రూట్ చేసిన ఉదంతంలో బెంగళూరు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో మీటింగ్‌లు పెట్టుకున్న ఐసిస్ సానుభూతి పరులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. సిరియాలో ఉండే యూసఫ్ ఆల్ హింద్ అలియాస్ అజయ్ భాయ్ ఆదేశాలను అమలు చేయడమే సానుభూతి పరుల టార్గెట్‌. 2016-17మధ్య 17మందిపై చార్జ్ షీట్ నమోదు చేయగా నేరం రుజువైన 15మందికి ఈనెల 22న ఎన్ఐఏ స్పెషల్ కోర్టు శిక్ష ఖరారు చేయనుంది.

Next Story

Most Viewed