- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పానీపూరి ఘటన: మానవ హక్కుల కమిషన్ నోటీసులు
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో మూడు రోజుల క్రితం కలుషిత పానీపూరి తిని 40 మంది అస్వస్థతకు గురైన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం స్పందించింది. ఈ ఘటనపై ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్, జిల్లా ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. లాక్డౌన్ సమయంలో పానీపూరి బండి ఎలా తెరిచి ఉంచారని ఎస్హెచ్ఆర్సీ ప్రశ్నించింది. ఈ విషయంలో మున్సిపల్, కార్పొరేషన్, పోలీసు శాఖల వైఫల్యంపై కమిషన్ మండిపడింది. హైదరాబాద్కు చెందిన బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు […]</p>
దిశ, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో మూడు రోజుల క్రితం కలుషిత పానీపూరి తిని 40 మంది అస్వస్థతకు గురైన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం స్పందించింది. ఈ ఘటనపై ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్, జిల్లా ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. లాక్డౌన్ సమయంలో పానీపూరి బండి ఎలా తెరిచి ఉంచారని ఎస్హెచ్ఆర్సీ ప్రశ్నించింది. ఈ విషయంలో మున్సిపల్, కార్పొరేషన్, పోలీసు శాఖల వైఫల్యంపై కమిషన్ మండిపడింది. హైదరాబాద్కు చెందిన బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు ఫిర్యాదు మేరకు కమిషన్ స్పందించింది. ఈ ఘటనపై తీసుకున్న చర్యలపై పూర్తి వివరాలతో తమ ముందు హాజరుకావాలని మున్సిపల్, పోలీసు శాఖను కమిషన్ ఆదేశించింది.
Next Story






