ప్రణాళికయుతంగా ‘మూసీ’ పునర్జీవ పనులు

by  |
ప్రణాళికయుతంగా ‘మూసీ’ పునర్జీవ పనులు
X

దిశ ప్ర‌తినిధి ,హైద‌రాబాద్: మూసీ నది కాలుష్యాన్ని నివారించి పర్యావరణ హితంగా పునర్జీవింప చేయుటకు ప్రణాళికా యుతంగా పనులను కొనసాగించాలని ఎన్.జీ.టీ మానిటరింగ్ కమిటీ చైర్మన్, జస్టిస్ విలాస్ వి. అఫ్జల్ పుర్కర్ సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మొహంతి, రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర సభ్యులతో నిర్వహించిన సమావేశంలో మూసీ పునరుజ్జీవనానికి వివిధ శాఖల ద్వారా చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించారు. ఓ.ఆర్ ఆర్ లోపల 55 కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తున్న మూసి నదిలో 42 ప్రధానమైన నాలాలు కలుస్తున్నాయనీ, ప్రధాన ప్రాంతాల్లో మురుగు నీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటుచేస్తున్నట్లు ఈ కమిటీ మెంబర్ కన్వినర్‌గా వ్యవహరిస్తున్న జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ సి. వై .నగేశ్ తెలిపారు.


Next Story