రాయలసీమపై తెలంగాణ వాసి పిటిషన్

by  |
రాయలసీమపై తెలంగాణ వాసి పిటిషన్
X

దిశ,వెబ్‌డెస్క్: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్‌జీటీలో విచారణ జరుగింది. పనులు నిలిపివేయాలని ఎన్‌జీటీ గతంలో తీర్పు ఇచ్చిన, ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ తెలంగాణ వాసి గరిమళ్ల శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. తీర్పును ధిక్కరించి పనులు కొనసాగిస్తే చీఫ్ సెక్రటరీని జైలుకు పంపుతామని ఎన్‌జీటీ ప్రభుత్వాన్ని హెచ్చరించినది. అయితే ప్రాజెక్ట్ పనులు నిలిపివేసి పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేశామని ఎన్‌జీటీకీ ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఏపీ ప్రభుత్వ వాదనలపై ఎన్‌జీటీ అనేక అనుమానాలను వ్యక్తం చేసింది. రాయలసీమ పథకం తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కేఆర్ఎంబీ, పర్యావరణ శాఖలకు ఎన్‌జీటీ ఆదేశాలు జారీచేసింది. అలాగే తదుపరి విచారణ జులై 12కు వాయిదా వేసింది.


Next Story