టీఎన్జీవో రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి ఏకగ్రీవం..!

by  |
టీఎన్జీవో రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి ఏకగ్రీవం..!
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: టీఎన్జీవో రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా రాయకంటి ప్రతాప్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ఆధ్యక్షతన సోమావారం నాంపల్లిలోని కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాయకంటి ప్రతాప్‎ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రాయకంటి ప్రతాప్.. ఇప్పటివరకు నగర శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ సందర్భంగా రాయకంటి ప్రతాప్ మాట్లాడుతూ.. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ సహకారంతో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు.

Next Story

Most Viewed