రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి

by  |
accident
X

దిశ, కామారెడ్డి: కారు బోల్తా పడి నవ దంపతులు మృతి చెందిన ఘటన మాచారెడ్డి మండలం లక్ష్మీదేవునిపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం దోమకొండ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన కుటుంబం మాచారెడ్డి మండలం ఎల్పుగొండ గ్రామంలో నివాసం ఉంటున్నారు. సోమవారం రాత్రి ప్రవీణ్, రేణవ్వ, లక్ష్మీ, బాలవ్వ, అఖిలలు ఓ కారులో గంభీరావుపేటకు బయలుదేరారు. దారిలో లక్ష్మీదేవునిపల్లి శివారులో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్(25), రేణవ్వ(24) అక్కడికక్కడే మృతి చెందారు. వీరిద్దరికి ఇటీవలే వివాహం జరిగింది. ఈ ప్రమాదంలో లక్ష్మీ, బాలవ్వ, అఖిలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించారు. గాయాలైన వారికి జిల్లాస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story