నవవధువు ఆత్మహత్యాయత్నం

by  |
నవవధువు ఆత్మహత్యాయత్నం
X

నవవధువు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆదివారం ఉదయం ఇబ్రహీం పట్నం వద్ద కృష్ణానదిలో దూకింది. అది గమనించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆమెను ప్రాణాలతో కాపాడారు. బాధితురాలు మంగళగిరికి చెందిన హేమలతగా గుర్తించారు. సమాచారం అందుకున్నపోలీసులు ఘటనా స్థలికి చేరకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం బాధితురాలిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు. కాగా, ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సిఉంది.

Next Story

Most Viewed