ఏపీలో కొత్తగా 6,952 కరోనా కేసులు

by  |
AP corona Update
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతుంది. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో 1,08,616 కరోనా పరీక్షలు నిర్వహించగా 6,952 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 18,03,074కు చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 58 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 11882 మంది మృతిచెందారు. ఇకపోతే ఒక్కరోజులో 11,577 మంది కరోనా నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 16,99,775 డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 91,417 యాక్టివ్‌ కేసులుండగా.. ఇప్పటివరకు 2,03,48,106 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

Next Story

Most Viewed